‘రెడ్‌క్రాస్‌’ను అభివృద్ధి చేద్దాం

‘రెడ్‌క్రాస్‌’ను అభివృద్ధి చేద్దాం

జనగామ కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో Indian Red Cross Society ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వితీయ మేనేజింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని, అందరం కలిసి సొసైటీని అభివృద్ధి చేద్దామని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. ఈనెల 26న నూతన కమిటీ ఎన్నికైన విషయం తెలిసిందే. మంగళవారం మేనేజింగ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

అనంతరం Janagama Area Hospital జనగామ ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించి 31 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌‌ డి.లవకుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ పి.గోపయ్య, కార్యదర్శి కన్న పరశురాములు, కోశాధికారి కుర్రెంల యాదగిరి, స్టేట్ ఎంసీ మెంబర్ మహమ్మద్ గౌస్ మోహియుద్దీన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు సి.ఉపేందర్ రెడ్డి, డాక్టర్‌‌ పి.సత్యం, పి.ప్రభాకర్, కృష్ణ జీవన్ బజాజ్, గాదె క్యాథరిన్, బి.రజినీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌‌ పి.సుగునాకర్‌‌రాజు పాల్గొన్నారు.