లీకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్‌ రాజీనామా చేయాలి

లీకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్‌ రాజీనామా చేయాలి

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద  బీజేపీ  దీక్ష చేపట్టింది.  ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొని ప్రసంగించారు. 'నిరుద్యోగులు ఆందోళనకు గురి కావొద్దు. ప్రభుత్వం మెడలు వంచే దాకా వదిలే ప్రసక్తే లేదు. ప్రశ్నా పత్రం లీకేజీకి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలి. నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు.

ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మహా ధర్నా చేపట్టాం. ఈ రోజు సిట్ అధికారులను నేనే పిలిచి నోటీసులు అందుకున్నాను. ప్రశ్నాపత్రం లీకేజీలో ఇద్దరి ప్రమేయమే ఉందని కేటీఆర్‌ చెప్పారు. ఇద్దరే ఉన్నప్పుడు ఇతరులను ఎలా అరెస్టు చేశారో కేటీఆర్‌ చెప్పాలి. రాష్ట్రంలోని నిరుద్యోగులు నిరాశకు గురికావొద్దు..బీజేపీ  అధికారంలోకి వస్తుంది.. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తుంది' అని బండి సంజయ్‌ అన్నారు.