ప్రశ్నాపత్రాల లీకేజీ రాజద్రోహమే

ప్రశ్నాపత్రాల లీకేజీ రాజద్రోహమే
  • రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలన అమలు చేయాలి
  • టీఎస్ పి ఎస్ సి బోర్డు సభ్యులంతా నిందితులే
  • బీఎస్పీ రాష్ట్ర చీప్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా: లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న టిఎస్ పి ఎస్ సి బోర్డు సభ్యులంతా నిందితులేనని ప్రశ్నాపత్రాల లీకేజీ రాజ ద్రోహమే అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రశ్నాపత్రాల లీకేజీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన సిబ్బంది కుటుంబీకులు బోర్డు సభ్యులుగా ఉండటం వల్లే జరిగిందని బోర్డు చైర్మన్ తో పాటు సభ్యులందరినీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేని ఆరుగురికి 120 మార్కులు రావడం జరిగిందని వీరందరి కాల్ డేటా తో పాటు బోర్డు సభ్యులకు కాల్ డేటాను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సిట్ తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలు బాధిత నిరుద్యోగులు కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ప్రభుత్వ బండారం బయటపడుతుందని ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకుంటే కొందరి రాష్ట్రంగా మారిందని తెలంగాణ అందరి రాష్ట్రంగా మార్చేందుకు అన్ని పార్టీలు ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

1400 గ్రామపంచాయతీ లలో 2600 కిలోమీటర్లు 200 రోజుల పాటు బహుజన రాజ్యాధికార యాత్రను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తూ కోచింగులకు లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని ఇలాంటి తరుణంలో ప్రశ్నాపత్రాలలో లీకేజీ కావడం దారుణమని విమర్శించారు ఇంత జరుగుతున్న చైర్మన్ జనార్దన్ రెడ్డి చిన్న తప్పుగా చూస్తున్నారే తప్ప వాస్తవాలపై విచారణ జరిపించడం లేదని ఈయన ఆయాంలో అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలు అయ్యాయని ఆయన ఆరోపించారు వెంటనే బోర్డును రద్దుచేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.ఈ కుంభకోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి అండదండలతోనే విచారణ నీరు గారుతుందని ఆయన అన్నారు సీఎం కార్యాలయంలో పనిచేసే రాజశేఖర్ రెడ్డి బంధువు లింగారెడ్డి బోర్డు సభ్యులుగా ఉండటం మెదక్ జిల్లాలో పార్టీ నాయకులుగా ఉన్న సుమిత్ర ఆనంద్ తోపాటు మరో టిఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ టీఎన్జీవో అధ్యక్షులుగా పనిచేసిన కారం రవీందర్ రెడ్డిలు బోర్డు సభ్యులుగా ఉండడం ఇందుకు ఉదాహరణగా తెలిపారు.కుంభకోణం లో ముఖ్యమంత్రి కుటుంబం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పసుపుల రామకృష్ణ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్ కార్యదర్శి బోనాసి రామచందర్ జిల్లా ఇన్చార్జి అంతటి నాగన్న అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పృథ్వీరాజ్ మోత్కుపల్లి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.