రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పద్మ

రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:  చికిత్స కోసం 2.50 లక్షల ఎల్ఓసి మంజూరు పత్రంను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శనివారం అందజేశారు. హవెలి ఘనపూర్ మండలం బ్యాతోల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త ప్రభాకర్ సతీమణి స్వరూప తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

విషయాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం ద్వారా  రెండు లక్షల యాభై వేల ఆర్ధిక సహాయం ముఖ్యమంత్రి సహాయానిధి నుండి ఎల్ఓసి మంజూరు చేయించారు. ఎ సందర్బంగా స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.