ఎస్సై ని సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

ఎస్సై ని సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

ముద్ర. వీపనగండ్ల:-పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బదిలీల్లో భాగంగా గద్వాల జిల్లా గట్టు మండలం నుంచి బదిలీపై వీపనగండ్ల ఎస్సైగా వచ్చిన ఎస్ఐ నందికర్ ను వనపర్తి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు శాలువాతో సన్మానం చేశారు.మండలం లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం  పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ సహకరిస్తామని ఎస్ఐ కి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దయ్యపు రవి వర్మ,టిఎంఆర్పిఎస్ నాయకులు మీసాల రాము దయపు రాఘవేంద్ర  ప్రవీణ్ ,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.