శ్రీమతి వాణీ జయరాం గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

శ్రీమతి వాణీ జయరాం గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్
Janasena Chief Pawan Kalyan

ప్రముఖ గాయని శ్రీమతి వాణీ జయరాం గారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మన తెలుగు భాషతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో శ్రీమతి వాణీ జయరాం గారు ఆలపించిన గీతాలు శ్రోతలను అమితంగా మెప్పించాయి. శంకరాభరణంలో ఆలపించిన పాటలను ఇప్పటికీ మరచిపోలేం. అలాగే పూజ, సీతాకోకచిలుక, స్వాతి కిరణం లాంటి చిత్రాల్లో గీతాలు శ్రీమతి వాణీ జయరాం గారి గాన ప్రతిభను తెలియచేస్తాయి. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన శ్రీ వాణీ జయరాం గారు ఆ పురస్కారం స్వీకరించకుండానే కన్నుమూయడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. 

(పవన్ కళ్యాణ్)