ఐసీఏఆర్– ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో లులులో మిల్లెట్ ఉత్సవ్
- తృణధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు
- ఐసీఏఆర్–ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి
- డిసెంబర్ 17 వరకు కొనసాగనున్న ఉత్సవ్
హైదరాబాద్: వంద రకాల మిల్లెట్లలో (తృణధాన్యాలు) 76 రకాల ప్రీమియం బ్రాండ్లతో అత్యద్భుతమైన ఆఫర్లతో అంతర్జాతీయ మిల్లెట్స్ –2023(ఉత్సవ్) ఫెస్ట్ను లులు నిర్వహించింది. లులుమాల్లో జరిగిన అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా ఐసీఏఆర్–ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి పాల్గొని మిల్లెట్లతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ ఫెస్ట్ డిసెంబర్ 17వరకు కొనసాగనుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మిల్లెట్స్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో మిల్లెట్లను భాగం చేసుకోవడంతో అధిక మొత్తంలో ప్రోటీన్లు, మినరల్స్ను పొందుతామన్నారు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉంటామన్నారు. మిల్లెట్ ఇయర్ను లులుమాల్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐసీఎఆర్, ఐఐఎంఆర్, న్యూట్రీ హబ్, ఐఐహెచ్ఎంల సహకారంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
ఈ ఫెస్ట్లో సాంప్రదాయ, రుచికరమైన, తీపి మిల్లెట్ వంటకాలతో రకరకాల వంటకాలను రుచి చూపించారు. ఫెస్ట్లో భాగంగా రోజూ పలురకాల మిల్లెట్ స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. లులులో మిల్లెట్లతో చేయబడిన బేకరీ ఉత్పత్తులు కూడా నాణ్యమైన, సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయి.
వంటకాలను ఆరగించడం, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు లులు మిల్లెట్ స్టార్–యాప్ కియోస్క్ను కూడా ఏర్పాటు చేసింది. మిల్లెట్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలకు, మిల్లెట్ల కొనుగోళ్లకు లులును సందర్శించాలని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ వేడుకలో ప్రముఖ సంస్థలు పాల్గొనడం తమ సంస్థకు మాత్రమే దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.