కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలి..నరేష్.

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలి..నరేష్.

ముద్ర. తిరుమలగిరి :రానున్న ఎన్నికల్లో తిరుమలగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తలు విభేదాలు మానీ సైనికుల వలె కృషి చేయాలని తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యేల్సోజు నరేష్ అన్నారు ఆదివారం నాడు తిరుమలగిరి మండల పరిధిలోని వెలిశాల గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రస0గి0చారు. రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో  స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. సందర్భంగా వెలిశాల గ్రామ శాఖ కార్యవర్గం ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ధూపటి అశోక్ ఉపాధ్యక్షులుగా ఆలకుంట లింగయ్య ఎన్నికగా ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోరెడ్డి సోమిరెడ్డి మాజీ సర్పంచ్ బైరెడ్డి సోమిరెడ్డి మెరుగు సోమన్న చిలుకల శ్రీశైలం ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరు అంబేద్కర్ మైనార్టీ చైర్మన్ ఎండి హాఫిజ్ గుండెపురి ఎంపిటిసి జమ్మి లాల్. డి రామోజీ  ప్రేమ్ కుమార్ ఎల్లం మల్లేష్  కడారి మల్లేష్ చందు తదితరులు పాల్గొన్నారు