కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు... బీజేపీ కూటమి జోరు

కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు... బీజేపీ కూటమి జోరు

దేశవ్యాప్తంగా మొదలైన కౌంటింగ్ ప్రక్రియ
మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
46 లోక్ సభ స్థానాల్లో బీజేపీ ముందంజ

దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ కూటమి (ఎన్డీయే) జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ఎన్డీయే కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 14 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.