దమ్ముంటే తెలంగాణ పథకాలు మహారాష్ట్రలో అమలు చేయాలి
తెలంగాణలో అమలువుతున్న పథకాలు దమ్ముంటే మహారాష్ట్రలో అమలు చేయాలని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళితబంధు అమలవుతోందన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఉచితంగా నీరు అందిస్తున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు.