నాగుపాముకు జీపి కార్మికుల వినతి పత్రం

నాగుపాముకు జీపి కార్మికుల వినతి పత్రం

ముద్ర, మల్యాల: రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం మల్యాల మండల పంచాయతీ కార్మికులు వినూత్నoగా తమ నిరసన తెలిపారు. మల్యాల బ్లాక్ చౌరస్తా వద్దకు నాగుపామును తీసుకొచ్చి, దానికి వినతి పత్రం చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం ద్రుష్టిని ఆకర్షించేందుకు ఇకపై ఏదోఒక వినూత్న నిరసన చేపట్టనున్నట్లు సీఐటీయూ నాయకులు కోరేపు మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, రాజు, రవి, తదితరులు పాల్గొన్నారు.