సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి - కలెక్టర్ భవేశ్ మిశ్రా

సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి - కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది ఇచ్చిన ధరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖలకు పంపించారు.

ప్రజావాణి ధరఖాస్తుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని, వాటిని పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో డిపిఓ ఆశాలత, సిపిఓ  కె.శామ్యూల్, డిఆర్ డిఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.