ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు కల్పించండి

ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు కల్పించండి

ముద్ర, రాయికల్ : రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్ సూపరిండెంట్ సుదక్షిణాదేవి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సరియైన వసతులు మరియు మెడిసిన్ సంబంధించిన వాటిపై సూపరిండెంట్ కు తెలియజేయడం జరిగింది. మరియు వైద్యులను త్వరగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాకలరమేష్, కొయ్యడి మైపాల్ రెడ్డి,ఎద్దండి దివాకర్ రెడ్డి,మొహమ్మద్ షాకీర్,కడకుంట్ల నరేష్,బత్తిని భూమయ్య, దాసరి గంగాధర్, బత్తిని నాగరాజు,పోన్నం శ్రీకాంత్,రాకేష్ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది.