అయోధ్య రామాలయ అక్షింతలు ఇంటికి ఇంటికి వితరణ

అయోధ్య రామాలయ అక్షింతలు ఇంటికి ఇంటికి వితరణ

ముద్ర,రాయికల్ :-రాయికల్ మండలం ఆలియా నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ శ్రీ అయోధ్య రామ దేవాలయ అక్షింతలను స్వీకరించి ఇంటింటికి వితరణచేశారు.లోక కళ్యాణాన్ని అక్షింతలు పెద్దల ఆశీర్వాచనాలై వర్ధిల్లి తండ్రి మాట జవదాటని శ్రీరాముని పాలనా దార్శకత,సీతమ్మ పవిత్రత ఈ లోకానికి ఆదర్శప్రాయంగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ శృతి కార్యక్రమాన్ని నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ లావడియ నందు నాయక్,సురేష్,మహేష్,వసంత,రాజేష్,శ్రీకాంత్,మదన్, తదితరులు పాల్గొన్నారు.