స్వచ్ఛ పట్టణం కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్న ఆర్ పి లు.

స్వచ్ఛ పట్టణం కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్న ఆర్ పి లు.

ఆలేరు (ముద్ర న్యూస్):కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ పట్టణ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆర్పి లు పట్టణంలోని అనేక కాలనీలలో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛ పట్టణం కార్యక్రమం పై అవగాహన కల్పించారు. అనంతరం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాలు పరిశుభ్రంగా ఉంటేనే మెరుగైన ఆరోగ్యం అందుతుందని ప్రజలకు వివరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పట్టణంలోని ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లు గొట్టిపాముల ధనలక్ష్మి. మోరిగాడి వందన. దేవి. పుట్ట భాగ్య. సమ్మక్క. రమ తో పాటు తదితరులు పాల్గొన్నారు.