రావి నారాయణరెడ్డి ఆశయ సాధనకు  కృషి చేయాలి

రావి నారాయణరెడ్డి ఆశయ సాధనకు  కృషి చేయాలి
  • విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం .. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి భువనగిరి : రావి నారాయణరెడ్డి ఆశయ సాధనకు  ప్రతి ఒక్కరు  కృషి చేయాలని,  రావి నారాయణరెడ్డి విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించేలా చర్యలు తీసుకుంటానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన రావి నారాయణరెడ్డి ఆశయాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. భూదానోద్యమంలో పేదలకు భూములు పంచి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. రావి నారాయణరెడ్డి సేవలు ఈ ప్రాంత ప్రజలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, రావి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.