ఘనంగా రావి చెట్టు హనుమాన్ శోభాయాత్ర
![ఘనంగా రావి చెట్టు హనుమాన్ శోభాయాత్ర](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642ee18ce5cf0.jpg)
ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రావిచెట్టు హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఘనంగా శోభయాత్రను నిర్వహించారు. ట్రాక్టర్ ఫై హనుమాన్ ఫోటోను వుంచి పూలతో అలంకరించారు.హనుమాన్ శోభాయాత్ర గ్రామంలోని పురవీధుల గుండ హనుమాన్ భక్తులు కాషాయ జెండాలు పట్టుకొని నృత్యాలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ, శోభయాత్రను కొనసాగించారు. మహిళలు ఆ స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు.
హనుమాన్ శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు గ్రామస్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.సిరా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు జవాజి లింగం, ద్యాగం నారాయణ, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, తోట బాలయ్య, పారిపెల్లి రామ్ రెడ్డి, బొమ్మ కంటి రవి, మేగి నరసయ్య, దొంతి అమరేందర్ రెడ్డి, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, సందుపట్ల లక్ష్మారెడ్డి, యమగుండ కృష్ణారెడ్డి, నేవూరి సురేందర్ రెడ్డి, పద్మా రెడ్డి, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.