ఫార్మసీ చట్టం అమలుతోనే ఉపాధి అవకాశాలు.. సరోజినీ రాములమ్మ ఫార్మసీకాలేజ్  ప్రిన్సిపాల్  డా.కోటేశ్వరి

ఫార్మసీ చట్టం అమలుతోనే ఉపాధి అవకాశాలు.. సరోజినీ రాములమ్మ ఫార్మసీకాలేజ్  ప్రిన్సిపాల్  డా.కోటేశ్వరి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:ఫార్మసీ యాక్టు అమలు తో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని మూన్ రే ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కోటేశ్వరి అన్నారు. ఫార్మసీ చదివిన నిరుద్యోగ యువతకు అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఏ . సంజయ్ రెడ్డి, కుమార్ ల ఎన్నికల ప్యానల్ అభ్యర్థులు  కలశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా కలశాల ప్రిన్సిపల్ డా. కోటేశ్వరి మాట్లాడుతూ ఫార్మసీ యాక్ట్ ను క్షేత్రస్థాయిలో అమలు చేస్తే ఫార్మాసిస్టులందరికీ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కౌన్సిల్ సేవలను మరింత సులభతరం చేయాలన్నారు. పానెల్ సభ్యుడు కుమార్ మాట్లాడుతూ  ఏ.సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయటానికి రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యుల సహకారంతో గుంటూరులోని ఫార్మసీ కౌన్సిల్‌ను హైదరాబాద్ కు తీసుకు రాగలిగారని, ఇందుకోసం ముఖ్యమంత్రిని కలిసి కోరగానే కౌన్సిల్ ఏర్పాటు చేసిందని అన్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఫార్మసీ షాపుల్లో ఫార్మసిస్టులకు కనీస వేతనం ముప్పై వేలు ఇప్పిస్తామన్నారు.మా పానెల్ సభ్యులు ఏ . సంజయ్ రెడ్డి క్రమ సంఖ్య 3, కుమార్ 36, డాక్టర్ మహాలక్ష్మి 37, పి సందీప్ 58,సురేష్ ఆనంద్ 63, వి. భాస్కర్ రావు 75 సభ్యులకు గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అసిస్టంట్ ప్రొఫెసర్లు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.