సర్వాయి పాపన్న పోరాట పటిమ ఆదర్శనీయం - మంత్రి అల్లోల

సర్వాయి పాపన్న పోరాట పటిమ ఆదర్శనీయం - మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  పీడిత వర్గాల అభ్యున్నతి కోసం సర్వాయి పాపన్న చూపిన తెగువ,పోరాట పటిమ నేటి సమాజానికి ఆచరణీయమని రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సర్వాయి పాపన్న 313వ వర్ధంతిని కలెక్టరేట్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి మంత్రి అల్లోల, కలెక్టర్ వరుణ్ రెడ్డి లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పీడిత ప్రజల కోసం చేసిన పోరాటాన్ని, చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.