పొదుపు సంఘాల బలోపేతం కావాలి

పొదుపు సంఘాల బలోపేతం కావాలి

సైదాపూర్ ముద్ర: పొదుపు సంఘాలు బలోపేతం కావాలని తద్వారా సంఘ సభ్యుల ఆర్థిక వృద్ది, సంఘాల అభివృద్ధి సాధ్యమని వెంకేపల్లి,సైధాపూర్ శివరామకృష్ణ పొదుపు సమితి అధ్యక్షులు జల్లా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలోని వెంకెపల్లి లోని సమితి కార్యాలయ ఆవరణలో సమితి పరిధిలోని తొమ్మిది సంఘాల పాలకవర్గ సభ్యులతో వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి వార్షిక నివేదికను గణకులు అనగోని వీరన్న గౌడ్ నివేదించారు. సమితి పరిధిలోని తొమ్మిది సంఘాలలో 3800 మంది సభ్యులు ఉండగా నాలుగు కోట్ల నిధులతో ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నట్లు. సంఘ సభ్యుల ఆర్థిక వృద్ది కోసం ఆపదలలో అప్పులివ్వడం, బీమా సౌకర్యాలు కల్పించడం. లాభాలను బోనస్ ల రూపంలో అందించడం. సహకార చట్టానికి లోబడి సంఘాల ఆబ్యున్నతికి కృషిచేస్తున్నట్లు సమితి అధ్యక్షులు  శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో సహవికాస కోశాధికారి రేవతి, సమితి పాలకవర్గ సభ్యులు ఈదులకంటి మాధవరెడ్డి, వాసుదేవరెడ్డి , భూమయ్య, పేరాల తిరుపతి,పాల్గొన్నారు