క్షతగాత్రున్ని పరామర్శించిన సుధగాని....

క్షతగాత్రున్ని పరామర్శించిన సుధగాని....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన చింతకింది అనిల్ మంగళవారం నాడు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని మేడిపల్లి లో గల కాకతీయ హాస్పటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు సుదగాని హరి శంకర్ గౌడ్ బుధవారం నాడు హాస్పిటల్ కి వెళ్లి అనిల్ ను పరామర్శించారు. ఆయన వైద్యులను అనిల్ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుటుంబ సభ్యులు. బంధుమిత్రులు. తదితరులు పాల్గొన్నారు.