ఆత్మగౌరవం గురించి మీరా మాట్లాడేది

ఆత్మగౌరవం గురించి మీరా మాట్లాడేది
  • ఆత్మీయ సమ్మేళన సమావేశంలో టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రంగినేని అభిలష్ రావు

ముద్ర.చిన్నంబావి (ఆగస్టు 22):-పార్టీలోనే ఉంటూ పార్టీలోని ఇతర నాయకుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే చేతులు ముడుచుకొని కూర్చునేది లేదని, తమకు కూడా ఆత్మగౌరవం అనేది ఉంటుందని తెలంగాణ పిసిసి రాష్ట్ర కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు హెచ్చరించారు.మంగళవారం చిన్నంబావి మండల కేంద్రంలోని  ఇందిరాగాంధీ ఆడిటోరియంలో రంగినేని అభిలాషరావు తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.గడచిన రెండు సంవత్సరాలుగా కొల్లాపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశానని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాకను స్వాగతించానని అన్నారు.కానీ గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో తనను, తన అనుచరులను  రాజకీయంగా భూస్థాపితం చేయాలని జూపల్లి, జూపల్లి వర్గీయులు కోరుకుంటున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి జూపల్లి లో మార్పు వస్తుందని గత కొన్ని రోజులుగా వేచి చూశానని ఆయన చర్యల వల్ల కొల్లాపూర్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీకి  ఇబ్బందులు ఎదురవుతున్నాయని  విమర్శించారు. నియోజకవర్గంలో  జరుగుతున్న పరిణామాలను సమావేశానికి వచ్చిన కార్యకర్తల అభిప్రాయాలను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని,  వారం రోజుల్లో మార్పు రాకపోతే మరొక్కసారి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి,వీపనగండ్ల మండల  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీరయ్య యాదవ్,  సీనియర్ నాయకులు కంటే శివన్న,తాలూకా యూత్ కాంగ్రెస్ నాయకులు వహీద్, బాబా, వెంకట్ రెడ్డి, మద్ది లెట్టి,ఉషన్, రమేష్ జింకల, భార్గవ్ రెడ్డి, కోట్ల రాము,నరసింహ యాదవ్,తైలి కృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు.