సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ అవాస్తవం

సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ అవాస్తవం

సీఐ శశిధర్ రెడ్డి వివరణ ముద్ర,ఎల్లారెడ్డిపేట : సోషల్ మీడియాలో బుధవారం ఓ పోలీస్ అధికారి ఇంట్లో చోరీ అని పెట్టిన పోస్టులో నిజం లేదని ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ అధికారి ఇంట్లో చోరీ జరిగిందని ఇంట్లో పని చేసే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడని అసత్యపు పోస్టు పెట్టారని వెల్లడించారు. పోలీస్ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ అసత్యపు పోస్టులు పెట్టారని ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు. గతంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించామని వాళ్లు ఏ స్థాయిలో ఉన్న ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిరాధారణమైన పోస్టులు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించద్దని సూచించారు.