కిషన్ దాస్ పేట పాఠశాలలో ఉగాది వేడుకలు

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ఎంపీపీఎస్ పాఠశాలలోని ఉగాది వేడుకలను విద్యార్థిని విద్యార్థులతో కలిసి మంగళవారం ప్రిన్సిపల్ రజిత ఆధ్వర్యంలో జరుపుకున్నారు. మామిడి ఆకులతో తోరణాలు అలంకరించి మామిడికాయతో పచ్చడి తయారు చేసి విద్యార్థిని విద్యార్థులతో కలిసి సేవించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీటీసీ పందిర్ల నాగరాణి పరుశరామ్ గౌడ్, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, వార్డు సభ్యురాలు లావణ్య, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.