ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు..

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు..

చక్కెర కర్మాగారం తెర్పించకుండ కేటీఆర్ జగిత్యాల లో అడుగు పెట్టొద్దు..

రోళ్ల వాగు లో 1 టీ ఏం సీ నీరు నిల్వ చేసే వరకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు..ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి,జగిత్యాల:దశాబ్ద ఉత్సవాలను పురస్కరించుకొని సమావేశాలు నిర్వహిస్తూ. చెరువులు, కుంటల వద్ద విందు ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందని ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో  ఎమ్మెల్సీ  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.మిషన్ కాకతీయ ఎనిమిదేళ్ళ క్రితం చేపట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు.చెరువుల్లో గుర్రపు డేక్క, విష  పూరితంమైన పాల సముద్రంపు మొక్కల తో చెరువుల్లో నీటిని పశువులు కూడా నీరు తగలేని పరిస్థితి.మోతే చెరువు రెండేళ్లలో రెండు సార్లు తెగిపోయిందని గుర్తు చేశారు. రోల్ల వాగు, సురమ్మ చెరువు, సదర్ మట్ ప్రాజెక్ట్ ల అడుగు ముందుకు పడడం లేదు.రు.60 కోట్ల అంచనా తో  రాల వాగు ను 0.25 నుండి 1 టీ ఏం సీ చేయాలని 2015 లో ప్రారంభించారు..ఇంత వరకు రోళ్ళ వాగు పెంపు తో ముంపుకు గురయ్యే 1000 ఎకరాల అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు కొలిక్కి రాలేదు. సీతారాం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కోసం జగిత్యాల భుములు అప్పగించడం పై కాంగ్రెస్ అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశామని గుర్తు చేశారు.2018 కి ముందు సూరమ్మ చెరువు హరీష్ రావు ప్రారంభించినా ఇంత వరకు పూర్తి కాలేదు.

ధాన్యం సేకరణ మొదట్లో సంచిఎకరానికి సగటున 20 క్వింటాల్ చొప్పున ప్రతి రైతు ఎకరానికి రు.2000 నష్టపోతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతు ఎకరానికి రు.2,000 దగా చేయబడ్డాడు. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.ధర్మ కాంట ను పరిగణలోకి తీసుకోవాలని. .రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని చెప్పిన ఎందుకు నిర్ణయం తీసుకో వడం లేదు అని ప్రశ్నించారు.రైతు బిడ్డ గా, రైతు పట్ల చిత్తశుద్ది ఉంటే ఎందుకు రుణ మాఫీ చెయ్యడం లేదు  అని మంత్రి నిరంజన్ రెడ్డి నీ నిలదీశారు.విందులతో రైతుల కన్నీళ్లు తుడుస్తవా అని ద్వజమెత్తారు. రాష్ట్రం, కేంద్రం ఇద్దరు రైతులను దగా చేస్తున్నాయని ఆరోపించారు ..జగిత్యాల జిల్లా లోనే రోల్లవాగు, అర్ గుండాల ప్రాజెక్ట్ తెగి కోట్లాది విలువైన మత్స్య సంపద నీటిపాలు అయింది అన్నారు. యువ పారిశ్రామిక వేత్తగా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమ లు తీసుకొస్తు, ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్న  కేటీఆర్.. జగిత్యాల జిల్లా లో చక్కెర కర్మాగారాన్ని తెరిపించడం మీ బాధ్యత కాదా అని నిలదీశారు.జగిత్యాల జిల్లా రైతాంగం ఏం పాపం చేశారు. చక్కర కర్మాగారాన్ని తెరిపి స్తే మేము కూడా పాలాభిషేకం చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.చక్కర కర్మాగారాన్ని తెరిపించే వరకు జగిత్యాల లో అడుగుపెట్ట వద్ద ని కేటీఆర్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి కార్యదర్శి బండ శంకర్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ క ల్లే పల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు  మన్సూర్, పూర్ణచందర్ రెడ్డి, గుండా మధు, మామిడాల మహిపాల్, రాజేష్, కిషోర్, బండారి మధు పాల్గొన్నారు.