ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలది కీలక పాత్ర

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలది కీలక పాత్ర

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమారు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో బిఆర్ఎస్ కార్యకర్తలది  కీలక పాత్ర అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  అన్నారు. జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మండపం లో బి అర్ ఎస్ పార్టీ  జగిత్యాల అర్బన్, రూరల్ మండలం ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిచారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న  ఎమ్మెల్యే డ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ లతో కలిసి బి అర్ ఎస్ పార్టీ జెండా ఎగురేశారు. ఈ సందర్బంగా పార్టీపటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే, జడ్ పి చైర్ పర్సన్ బి అర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు  బాల ముకుందం, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, జెడ్పీటీసి మహేష్ , ఏఎంసి  ఛైర్మెన్ నక్కల రాధా, మాజీ ఏఎంసి ఛైర్మెన్ లు దామోదర్ రావు, దశరథ రెడ్డి,పాక్స్ ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, సర్పంచుల ఫోరం చెరుకు జాన్, గంగాధర్, ఎంపీటీసీ ల ఫోరం మహేష్, యూత్ అధ్యక్షులు  సురేందర్ రెడ్డి, శేఖర్ , ఏఎంసి వైస్ చైర్మన్ అసిఫ్, పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్, అర్బన్, రూరల్ మండల రైతు బందు సమితి కన్వీనర్ లు జంబర్తీ శంకర్, నక్కల రవీందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు  రౌతు గంగాధర్, సర్పంచులు, ఎంపిటిసిలు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.