మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్...

మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్...

ముద్ర,తెలంగాణ:-మద్యం ప్రియులకు వరుస షాకులు తగులుతున్నాయి.లోక్​సభ ఓట్ల లెక్కింపు జరిగే జూన్​ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూన్​ 5 బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు ఎవరు అతిక్రమించిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జనసంచారం కలిగిన ప్రాంతంలో బాణాసంచాలను కాల్చడము, విసిరేయొద్దని సీపీ కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.