మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్...
![మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్...](https://mudranews.in/uploads/images/2024/04/image_750x_661e0d4167f7c.jpg)
ముద్ర,తెలంగాణ:-మద్యం ప్రియులకు వరుస షాకులు తగులుతున్నాయి.లోక్సభ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూన్ 5 బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు ఎవరు అతిక్రమించిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జనసంచారం కలిగిన ప్రాంతంలో బాణాసంచాలను కాల్చడము, విసిరేయొద్దని సీపీ కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.