21 నుంచి 27వ తేదీ వరకు  మావోయిస్టు పార్టీ19వ వార్షికోత్సవాలు

21 నుంచి 27వ తేదీ వరకు  మావోయిస్టు పార్టీ19వ వార్షికోత్సవాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలు నిర్వహించబోతున్నట్లు సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించి విప్లవోత్సాహంతో వార్షికోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చింది. అనుకూలమైన పరిస్థితులను ఉపయోగించుకుంటూ, వర్గపోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని విస్తృతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరింది. పార్టీ సంఘటీకరణ క్యాంపెయిన్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.