అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బిజెపి రాస్తారోకో

అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బిజెపి రాస్తారోకో

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, బి సి బంద్ ఇవ్వాలని బి జే పీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేద్రంలో రాస్తా రోకో చేశారు. బిజెపి నాయకులు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరీ తాసిల్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి, పోలీసులు వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు. అనంతరం బిజెపి నాయకులు ఆర్డీవో కార్యాలయనికి తరలివెళ్లి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మదన్మోహన్, నియోజకవర్గ నాయకులు డాక్టర్ శైలేందర్ రెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, ఆముదరాజు, జగిత్యాల, సారంగపూర్ మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి,  వరుణ్ కుమార్, రెంటం జగదీష్, పులి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.