గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

తూప్రాన్, ముద్ర: బంధువుల ఇంటికి పండగకి వచ్చి చెరువులో  మునిగిన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి చెరువులో 
మునిపోయిన ఘటనలో ముగ్గురు మృతదేహాలు లభ్యం అయిన విషయం తెలిసిందే. కాగా గల్లంతు అయిన బాబు చరణ్ (10) మృతదేహం మంగళవారం ఉదయం చెరువు నీటిలో లభ్యం అయినట్లు ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి తెలిపారు. మృతదేహంను పోస్టు మార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ అస్పత్రి మార్చురికి తరలించారు.