ఈ నెల 17న సిరిసిల్ల సీఎం కేసీఆర్ సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ

ఈ నెల 17న సిరిసిల్ల సీఎం కేసీఆర్ సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ
  • బారి జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణుల ప్రణాళిక
  • సిరిసిల్ల లో లక్షా మందితో బహిరంగ సభ

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో లక్షా మందితో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ నెల 17 నిర్వహించే ఈ బహిరంగ సభకు లక్షా మందికి తక్కువ కాకుండా బీఆర్ఎస్ శ్రేణులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హజరుకానుండటంతో పోలీసులు బారి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు సమీపంలో సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మండలాల వారిగా బీఆర్ఎస్ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాలను సభకు రావాల్సిందిగా కోరుతున్నారు. నియోజకవర్గంలో 600 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, నాయకులు చీటీ నర్సింగరావు, మంచె శ్రీనివాస్, ధార్నం లక్ష్మీనారయణలు సిరిసిల్ల పట్టణం నుంచి 50 వేల మందిని సభకు తరలించేందుకు సన్నహాలు చేస్తున్నారు.