బెడ్ లు తయారు చేసే పరిశ్రమలో అగ్ని ప్రమాదం

బెడ్ లు తయారు చేసే పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని మైలర్ దేవ్ పల్లి టాటా నగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరుపుల బెడ్ తయారుచేసే కంపెనీలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, డి ఆర్  ఏస్ బృందం సహాయక చర్యలు చేపడుతు మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఫాహిం(ఇమ్రాన్ ఖాన్ ) అనే వ్యక్తికి చెందిన పరుపుల గోదాం లో మంటలు చెలరెగగ సుమారు 15 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిని అంచనా వేస్తున్నారు.