ఉత్తమ సేవలకు దక్కిన అరుదైన గౌరవం

ఉత్తమ సేవలకు దక్కిన అరుదైన గౌరవం

ఉత్తమ ఉద్యోగులుగా ఎస్ఐ జాడీ శ్రీధర్, కానిస్టేబుల్స్ సారంగపాణి, శంకర్, గ్రామపంచాయతీ కార్యదర్శులు నరేష్, సునీత, ఫోర్ మెన్ యాదగిరి   

ముద్ర, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యంగా నిరంతరం  పనిచేస్తూ..ప్రజల మన్ననలు  పొందుతూ..ప్రజాసేవకై అంకితమైన ఎస్ఐ జాడీ శ్రీధర్, కానిస్టేబుల్స్ సారంగపాణి   శంకర్, మొగుళ్ళపల్లి అంకుషాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శులు నరేష్, సునీత అలాగే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఫోర్ మెన్ యాదగిరిలు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై ఆగస్టు 15న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కర్ణాకర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తోటి ఉద్యోగుల సహకారంతోనే మాకు ఈ అవార్డు దక్కిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని రంగాపురం గ్రామ సర్పంచ్ బల్గూరి తిరుపతిరావు, మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మారావులు అభినందించారు.