కంటి వెలుగు దేశానికే ఆదర్శం- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

కంటి వెలుగు దేశానికే ఆదర్శం- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

సారంగాపూర్ ముద్ర: కంటి వెలుగు దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీర్ పూర్ మండల తాళ్ళ ధర్మారం గ్రామంలో కంటి వెలుగు కేంద్రాన్ని ఎమ్మెల్యే  ఆకస్మిక తనిఖీ చేసి కంటి వెలుగు సరళిని పరిశీలించారు. జగిత్యాల కంటి వెలుగు కేంద్రంలో ప్రజలతో మాట్లాడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కేంద్రంలో  అన్ని ఔషధాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జిల్లా వైద్య అధికారి శ్రీదర్ కు సూచించారు.  


ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా సభ్యుడు ముప్పల రాంచందర్ రావు, జిల్లా రైతు బందు సమితి సభ్యుడు కోలుముల రమణ, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, సర్పంచుల ఫోరం మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పిటిసి ముక్క శంకర్, మండల ఉప అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, యూత్ నాయకులు సదాలఅశోక్ తదితరులు పాల్గొన్నారు.