కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం హుజుర్ నగర్ పట్టణంలో పీర్ల కొట్టం బజారు17వ వార్డులో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయింది, దానిని మించి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను, కళ్ళజోడు ఉచితంగా ఇవ్వడం తో పాటు అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని ఆయన తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా షుగర్ పేషంట్స్ కి మెడికల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.