బి ఆర్ టి యు ఆధ్వర్యంలో యూనియన్ సంఘాల సమావేశం
![బి ఆర్ టి యు ఆధ్వర్యంలో యూనియన్ సంఘాల సమావేశం](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652a386f80cdf.jpg)
హుజూర్ నగర్ టౌన్ ముద్ర: బి ఆర్ టి యు అనుబంధ సంఘాలైన ఫ్రూట్, బజార్అమాలి, లారీ మెకానిక్ ల యూనియన్ల ముఖ్యలతో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేదలకు, కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంన్నదన్నారు. విద్య, ఆరోగ్యం పేదవారికి దగ్గర చేసిందని, పేద పిల్లలకు అల్పాహారం ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేయటం, ఎన్నో సంక్షేమ పథకాలు కెసిఆర్ అమలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి కార్మికుల క్షేమం కోరే వ్యక్తి అని, కార్మికులకు ఎల్ఓసిలు, సీఎం రిలీఫ్ ఫండ్ లు కార్యకర్తల కుటుంబాలకు అందజేశారన్నారు. నియోజవర్గంలో కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని ఘనవిజయంతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్ యూనియన్స్ అధ్యక్షులు నాగేందర్, అమాలి అధ్యక్షులు బాలకృష్ణ, ఉస్మాన్, వెంకటేశ్వర్లు, కార్మికులు పాల్గొన్నారు.