యుగంధర్ పై గుర్తు తెలియని దుండగుల దాడి
![యుగంధర్ పై గుర్తు తెలియని దుండగుల దాడి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6468edd54ed07.jpg)
ముద్ర, తిరుమలగిరి: సామాజిక ఉద్యమకారుడు అడ్వకేట్ అడ్డగూడూరు మండలం ప ర్రెపాడు గ్రామానికి చెందిన యుగంధర్ పై తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని దండగులు దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడ్డారు. తిరుమలగిరి మండల పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన దళిత బంధు అఖిలపక్ష కమిటీ సమావేశంలో పాల్గొని తన గ్రామానికి వెళుతుండగా కారును వెంబడించి గుర్తు తెలియని దుండగులు అనంతారం సమీపంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గాయపడ్డ యుగేందర్ ను చికిత్స నిమిత్తం వెంటనే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. యుగంధర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పలు ప్రజాసంఘాల నాయకులు కోరారు.