క్రీడల్లో గెలుపోటములు సహజం..

క్రీడల్లో గెలుపోటములు సహజం..
  • యువకులు అన్ని రంగాల్లో రాణించాలి..
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది కావాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్రంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ యూత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే సీతక్క  చేతులమీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడుతాయని అన్నారు. యువత ఆటలతో పాటు చదువులోను రాణించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవాలని చెప్పారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీడలను విజయవంతం చేసుకోవాలని సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, కొండూరు రమేష్, కుమ్మరి సారయ్య,
మామిండ్ల రాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.