డబుల్ ఇళ్ల కోసం కలెక్టర్ ఆఫీసు  ముందు నిరసన..

డబుల్ ఇళ్ల కోసం కలెక్టర్ ఆఫీసు  ముందు నిరసన..

 జాయింట్ కలెక్టర్ కు వినతి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం పేద ప్రజలు రోడ్డు ఎక్కారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ గణేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని తొందరగా పూర్తి చేసి, అర్హులైన పేదలకు అందించాలన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. రెండు నెలల్లో డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, పేదలకు ఆ ఇండ్లు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మొలుగోజు రత్న, గద్దల లక్ష్మి, ఝాన్సీ, తదితర మహిళలు పాల్గొన్నారు.