జగిత్యాల పట్టణ రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక...
![జగిత్యాల పట్టణ రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక...](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64844260d98d9.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ ప్రజల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. పట్టణంలోని నిజాంబాద్ రోడ్ లో గల రజక సంఘ భవనంలో జరిగిన ఎన్నికల సమావేశంలో రజక సంఘం అధ్యక్షునిగా మతులాపురం శంకర్., ఉపాధ్యక్షునిగా బోరగల్ల దేవరాజ్, ప్రధాన కార్యదర్శిగా మర్రిపెల్లి శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షునికి మరియు ఉపాధ్యక్షులు కు,కార్యదర్శికి, కార్యవర్గానికి రజక సంఘ నాయకులు, యూత్ సభ్యులు అభినందనలు తెలిపారు.