ఆర్థికం పేలవమే! ఆర్బీఐ ఎకానమీ రిపోర్టులో వెల్లడి | Mudra News
![ఆర్థికం పేలవమే! ఆర్బీఐ ఎకానమీ రిపోర్టులో వెల్లడి | Mudra News](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63eb17b7c085f.jpg)
న్యూఢిల్లీ: కొవిడ్కు ముందు తరువాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ తీరు పేలవంగా ఉందని ఆర్బీఐ ఎకానమీ సర్వే స్పష్టం చేసింది. ఎకానమీ సర్వే రిపోర్టును ఈ నేపథ్యంలో ఆర్బీఐ సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబరు 2012తో పోలిస్తే 2023 జనవరిలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. సెప్టెంబరు 2012తో పోలిస్తే జనవరి 2023లో ఉపాధి రంగంలో కూడా డౌన్ఫాల్ అయ్యింది. సెప్టెంబర్ 2012తో పోలిస్తే జనవరి 2023లో ఆదాయ స్థాయిలు తగ్గాయాని ఆ నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్డర్లు 2008–-09 క్యూ1తో పోలిస్తే సెప్టెంబర్ 2022–-23 క్యూ3లో తగ్గాయి. 2022–-23 క్యూ3తో పోల్చినప్పుడు 2014–-15 క్యూ 1 పోస్ట్ రికవరీ మార్గంలో సేవా రంగం మలుపు తిరిగింది. కానీ, 2014–-15తో పోలిస్తే తయారీ ఇంకా కోలుకోలేదని వెల్లడైంది. ఇక దేశంలో కీలకమైన వ్యవసాయ, తయారీ రంగానికి బ్యాంకు రుణాలు తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2017 క్యూ1 - 2022–-23 18 నుండి క్యూ3 వరకు మౌలిక సదుపాయాలు, సేవా రంగంలో పెరుగుదల గమనించినట్లు వెల్లడైంది. నోట్ల రద్దు, జీఎస్టీల అమలు తరువాత ఆర్థికరంగం ఇంకా కోలుకోలేదని దీని ద్వారా నిర్ధారణ అవుతోంది.