కర్నాటకలో మందకొడిగా సాగుతున్న పోలింగ్
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాని మందకొడిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.26 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సినీనటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు శాంతి నగర్లో ఓటేశారు. విజయనగరలో ఓటేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. షికారిపురాలో ఓటేసిన మాజీ సీఎం యడియూరప్ప. హుబ్లీలో ఓటేసిన సీఎం బస్వరాజ్ బొమ్మై. షిగ్గాన్ నుంచి పోటీ చేస్తున్న బస్వరాజ్ బొమ్మై. తుమకూరులో ఓటేసిన కాంగ్రెస్ నేత పరమేశ్వరన్. జయనగర్లో ఓటేసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. వరుణలో ఓటేసిన సిద్ధరామయ్య. బెంగళూరులో ఓటేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య. బెంగళూరులో ఓటేసిన హీరో ఉపేంద్ర. రామనగర్లో ఓటేసిన మాజీ సీఎం కుమార స్వామి. మైసూరులో ఓటేసిన క్రికెటర్ జువగళ్ శ్రీనాథ్.