కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం
  • మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్
  • ప్రజలు అందరూ ఆలోచించి ఓటు వేయండి

ముద్ర, జమ్మికుంట : జమ్మికుంట మండలంలోని సైదాబాద్ ,కోరపల్లి వెంకటేశ్వర పల్లి, గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్.ఎన్నికల  మేనిఫెస్టిలో ఇచ్చిన హామీలు మరచిన బిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఓట్ల కోసం వస్తుంది.హామీలు నెరవేర్చని బిఆర్ఎస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయండి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తాం.ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేసి తీరుతాం.గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం యువత కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తాం.ఆరోగ్యశ్రీ , ఫీ రియంబర్స్ మెంట్జ్ 108 తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ .అటు నోటిఫికేషన్లు జారీ ఇటు పేపర్ లీకేజీ చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కింది.అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు పెద్దపీట వేస్తాం.ఉప ఎన్నికలలో సెంటిమెంటుతో గెలిచిన ఈటల గెలిచి రెండేళ్లయిన ఏ ఒక్క పనైనా చేసిండా ప్రజలు ఆలోచించాలి.హుజురాబాద్ ప్రజలను మరిచిపోయేందుకే గజ్వేల్ లో ఈటల పోటీ చేస్తున్నాడు.బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే ఎవరికి ఓటేసిన ఏమి లబ్ధి జరగదు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి .మీ కష్టసుఖాల్లో తోడుంటా నియోజయకవర్గ అభివృద్ధికి పాటుపడుతాను.