చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల ను అమలు చేయలేదు

చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల ను అమలు చేయలేదు

రత్నాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల ను అమలు చేయలేదని మాజీ మంత్రి మంత్రి ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు అన్నారు, ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ దేవతలకు పూజలు చేసి అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తరుగు పేరిట రైతులను మోసం చేశారని, తాము గెలిచిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల తో పేదవారికి అండగా ఉంటామని శ్రీధర్ బాబు అన్నారు.

అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని రాష్ట్ర ఆడపడుచులు పడుతున్న బాధలను చూసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేరవేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొండయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ మంథని అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రొడ్డ బాబు, మాజీ అధ్యక్షులు తోట చంద్రయ్య, సీనియర్ నాయకులు వనం మంచందర్ రావు, ఎల్లె రామ్మూర్తి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.