ఆయిల్ పాం సాగుపై అవగాహన సదస్సు

ఆయిల్ పాం సాగుపై అవగాహన సదస్సు

ముద్ర,తంగళ్ళపల్లి: బద్దెనపల్లి రైతు వేదిక లో  అనుబంధ క్లస్టర్ పరిధిలో గల ఆరు గ్రామాల రైతులకు ప్రత్యామ్నాయ పంటల గూర్చి ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఎంపీపీ పడగల మానస హజరయ్యారు.ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి  వాణిజ్య పంటలైన ఆయిల్ ఫామ్ పై ప్రత్యేక దృష్టితో ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని కాబట్టి ఈ క్లస్టర్ పరిధిలో గల రైతులందరూ ఆయిల్ ఫాం సాగుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ క్లస్టర్ పరిధిలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు కొక్కిరాల సత్యనారాయణ రావు బద్దెనపల్లి 9 ఏకరాలు, పన్యాల విట్టల్ రెడ్డి రామన్న పల్లె 7 ఏకరాలు.సాగుచేసిన సందర్భంగా  వారిని ఎంపీపీ పడగల మానస, మరియు ప్రజా ప్రతినిధులు,అధికారులు ఘనంగా సన్మానించారు,వీరిని ఆదర్శంగా తీసుకొని ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలని రైతులకు ఎంపీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజిరెడ్డి,ఎంపీటీసీ చిలువేరు ప్రసూన,సర్పంచ్ ఆనందరావు ఏవో సందీప్,అగం రావు, ఏ ఈ ఓ లు, వివిధ గ్రామాల నాయకులు రైతు సోదరులు గ్రామస్తులు పాల్గొన్నారు.