మంత్రి కేటీఆర్ ను కలిసిన బీసీ రాష్ట్ర నేత పర్శ హన్మాండ్లు...
![మంత్రి కేటీఆర్ ను కలిసిన బీసీ రాష్ట్ర నేత పర్శ హన్మాండ్లు...](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_65116aa7cb048.jpg)
ముద్ర, గంభీరావుపేట :హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో మంత్రి కేటీఆర్ ను బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా శ్రీగాధ, కొల్లమద్ది , రాజుపేట గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను, గంభీరావు పేట మండల కేంద్రంలో బీసీ హాస్టల్, జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతి బా పూలే విగ్రహము ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. సానుకూలం గా స్పందించిన మంత్రీ కేటీఆర్ త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పర్శ హన్మాండ్లు తెలిపారు.