మృతుని కుటుంబానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆర్థిక సాయం

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ కు చెందిన బీజేపీ నాయకుడు దావత్ భాను ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి.వి.శ్యామ సుందర్ రావు సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఆ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు.