నాజీలు, తాలిబాన్ల పాలనను గుర్తుచేస్తున్న మణిపూర్‌ లో బిజెపి పాలన..

నాజీలు, తాలిబాన్ల పాలనను గుర్తుచేస్తున్న మణిపూర్‌ లో బిజెపి పాలన..

యావత్ భారత దేశంలో అత్యంత బాధేసిన ఘటన ఏదైనా ఉందంటే అది మణిపూర్‌లో ఆదివాసి మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం. లైంగికదాడి చేసి హత్యలు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. దేశంలోని తాజా పరిణామాలను చూస్తుంటే ఆనాడు నాజీలు. తాలిబాన్ల దుర్మార్గ పాలనను మణిపూర్ రాష్ట్రంలోబిజెపి పాలన గుర్తుకు తెస్తున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బైరాన్‌పల్లిలో రజాకార్లు స్త్రీలను బట్టలు విప్పించి బతుకమ్మ ఆడించిన ఘటనను యావత్ దేశ ప్రజలను గుర్తుచేశాయి.నేడు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల దుశ్చర్యలను మణిపూర్‌లాంటి దారుణాలు తలదన్నుతున్నాయి.బాధిత మహిళను కాపాడేండుకు అడ్డు వచ్చిన వారి సోదరుడిని, తండ్రిని చంపడం, సామూహిక అత్యాచారాలను గుర్తుకు చేస్తున్నాయి, నిరంతరం భారత్ మాతకు జై అని చెప్పే బిజెపి. ఆర్ఎస్ఎస్ లు భారతీయ ఏ సంస్కృతి, సాంప్రదాయాలు అనిపించుకుంటాయో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. మహిళలను వివస్త్రలను  చేసి ఊరేగింపు. అత్యాచారాలు. హత్యలకు పాల్పడిన నిందితులకు బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు వత్తాసు పలుకుతున్నాయి అని దేశం కోడై కూస్తోంది. ఈ చర్య అత్యంత పాశవికమైన చర్యగా, భారతీయ సంస్కృతికి మాయని మచ్చగా వారికి అనిపించడం లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు.ఇతర మతాల వారి మీద దాడులు చేయడం, చంపడం వారి స్త్రీలను మానభంగం చేయడం, వారి ఆస్తులను తగలబెట్టడం, హిందూ ధర్మం మూల సూత్రాలకు వేద విజ్ఞానానికి ఉపనిషత్తుల సారానికి పూర్తి వ్యతిరేకం.సనతన ధర్మమని చెప్పే వారికి అందరిలో ఆత్మ ఒక్కటేననే ప్రాథమిక విషయం పట్ల అవగాహన అవసరం. మతాలన్నీ మంచిని బోధిస్తాయి మానవత్వాన్ని చాటుతాయి.సాధనా పద్ధతులు చూపుతాయి.కానీ వాటిని రాజకీయాలకు వాడుకోవడం, ప్రజల్ని బలిపశువుల్ని చేయడం అత్యంత శోచనీయం. అని అనుకుంటున్నారు.ఏ మతం వారికి ఆ మతాన్ని అవలించే స్వేచ్ఛను మన రాజ్యాంగం అందించిందనేది దేశ ప్రజలందరికి తెలిసిందే. భిన్నమైన కులాలు, మతాచారాలు ఉన్న విషయాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు నాడే గుర్తించి అందరికీ సమాన అవకాశాలిచ్చారు.కుల, మత, జాతి,ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ సమన్యాయం దొరికే హక్కులు కల్పించారు. నేరస్తులు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఒకే రకమైన శిక్షకు అర్హులు అని అనుకుంటున్నారు.

బీజేపీ ప్రభుత్వం వీటన్నింటినీ మార్చే ప్రయత్నమే చేస్తోందనేది ప్రజలు గమనిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో మనువాదం తెచ్చే పనిలో బిజెపి. ఆర్ఎస్ఎస్ నిమగ్నమైంది. వారికి రాజ్యాంగం అవసరం లేదు.ప్రజాస్వామ్యంపై పట్టింపు లేదనేది ఈ చర్యల ద్వారా అర్ధం అవుతుంది. బిజెపి. ఆర్ఎస్ఎస్ ల అంతిమ లక్ష్యం ఒక్కటే దేశాన్ని హిందూత్వగా మార్చడం లక్ష్యంగా పెట్టుకొని ఈ కుట్రలకు దిగుతున్నారని  ఈ చర్యల ద్వారా అర్ధం అవుతుంది. వారి అంతిమ లక్ష్యం అమలు చేసే పనిలో ఉంటే మణిపూర్‌లాంటి ఘటనలు వారికేం కనిపిస్తాయి.పైగా నేరస్తులకు, నిందితులకు అండగా ఉంటూ ఎన్నికల్లో గెలిచినట్టుగా దేశ ప్రధాని . మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ల పనితీరు స్పష్టం చేస్తుంది. బీజేపీ తొమ్మిదేండ్ల కాలంలో చాలా బాధాకరమైన ఘటనలు అనేకం దేశ ప్రజలు చూస్తున్నారు.
బిల్కిస్‌ బానో కేసులో నిందితులకు శిక్షాకాలం పూర్తి కాకుండానే నిందితులను విడుదల చేయడం. బాధితురాలు గర్భిణిగా ఉన్న ఒక అబలను అత్యాచారం  చేసిన నిందితులు జైలు నుండి బయటకు వచ్చాక హిందూమత ఛాందసులు నిందితులకు సన్మానం చేయడం దేనికి సంకేతమో బిజెపి. అర్ఎస్ఎస్ నాయకులు దేశ ప్రజలకు బహిరంగ ప్రకటన ద్వారా తెల్పల్సిన అవసరం ఉందని అంటున్నారు.ఢిల్లీలో మహిళా రెజ్లర్లు ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడైన బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ సింగ్ శర్మ రెజ్లర్ల పట్ల లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేస్తే ఆ కేసును నమోదు చేయకపోవడంతో మహిళా రేజ్జార్లు ఆందోళన చేసిన ప్రధాని మోడీ పట్టించుకోక పోవడం దురదృష్టకరం. మహిళ మల్లయోదుల కన్నీళ్లను పట్టించుకున్న నాథుడు కేంద్ర ప్రభుత్వం లో లేకపోవడం దురదృష్టకరం. మహిళ రేజ్జార్ల
పార్లమెంట్‌ ఎదుట రోదించినా వారిది అరణ్యరోదనే అయింది.

బ్రిజ్‌భూషణ్‌ బీజేపీ నాయకుడైనంత మాత్రాన, పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్నా అతడు చేసిన నేరాలపై కేసు రిజిస్టర్‌ చేయక పోవడం బీజేపీ నాయకత్వానికి మహిళల పట్ల ఉన్న వైఖరిని తెలియజేస్తున్నది.నేరస్తులు, పాలకులు ఒక్కటైతే సమాజం ఎలా పురోగమిస్తుందొ ఈ సంఘటనలను రుజువు చేస్తున్నాయి.ఉగ్రవాదులు, మతోన్మాదులు ఏ మతం వారైనా, ఏ కులానికి చెందినా నేరస్తులే. ఏ మతం, ఏ కులం వారు అత్యాచారాలు, హత్యలు చేసినా పౌరులందరూ ఖండించాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని మత సామరస్యాన్ని బోధించినందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ప్రభావితుడైన గాడ్సే మహాత్మాగాంధీని కాల్చిచంపాడనేది నేటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.అందుకే మతోన్మాదనేది అత్యంత ప్రమాదకరం, దేశ అభివద్ధికి ఆటంకం.ఇటీవల చూసినట్లయితే హిందూమతం నుంచి కొందరు మరో మతంలోకి మారుతున్నారంటే కారణమేంటని ఆలోచించాల్సిన బాధ్యత బిజెపి. ఆర్ఎస్ఎస్ నాయకులకు ఉంది.హిందూమతంలోని కొందరు పాటిస్తున్న ఈ కుల వివక్షత కారణం కాదా?దళితులను  కొందరు మందిరాల్లోకి అనుమతించడం లేదు. దేవాలయాల్లోని సహపంక్తి భోజనాల్లో కూర్చొనివ్వడం లేదనే విషయం సుస్పష్టం. సాటి మనుషులను మనుషులుగా చూడనప్పుడు మరోచోట వారికి సమానత్వం కనబడినప్పుడు వారు మరోమతాన్ని ఎంచుకుంటారు.భారతదేశం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అవసరం. కులమత ఘర్షణల వల్ల భారత ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య లౌకికవాద దేశమని మనం చెప్పుకోవాడానికి ఇబ్బందులు పడుతున్నారు.మత ద్వేషాలను పెంచి పోషిస్తే తాత్కాలికంగా ఎన్నికల్లో మెజారిటీ మతస్తుల ఓట్లు వేయించుకొని లాభ పడవచ్చు కానీ మతోన్మాదం, మత విద్వేషాల వలన శాశ్వతంగా ఎదుటివారి మనోభావాలు దెబ్బతింతున్నాయి.హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఈనాడు కలిసి మెలిసి ఉన్నట్లు రేపటి రోజు ఐక్యంగా ఉండటం, పనిచేయడం కష్టమవుతుందనేది దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరి మీద ఒకరికి విశ్వాసం సన్నగిల్లుతుందనేది నేటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి కులమత విభేదాలు, ప్రాంతీయ అసమానతలు మన దేశాన్ని బలహీన పరుస్తాయి అనడానికి బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి.భవిష్యత్తులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వెళ్లే పరిస్థితి రావచ్చునేమో? మణిపూర్‌లో ఉన్న పరిస్థితి దేశమంతటా రావచ్చు.అందుచే విశాల దృక్పథంతో పజలు ఆలోచించాలి.విశాలమైన భావాలను వ్యాపింప చేయాలి. మత సామరస్యాన్ని బోధించాలి. విభేదాలను పోగొట్టి. దేశాన్ని కులం. మతం ఆధారంగా పాలన చేయాలనే లో కుట్రలను తిప్పికొట్టాలి.

  • వ్యాస రచయిత  మంగ వెంకటేష్ ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్  సి ఐ టి యు నాయకులు