దళిత రత్న అవార్డుకు ఎంపికైన బొలుమల్ల రాజమౌళి...

దళిత రత్న అవార్డుకు ఎంపికైన బొలుమల్ల రాజమౌళి...

మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రధానం

చిగురుమామిడి ముద్ర న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో స్వచ్ఛందంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తించి దళిత రత్న బిరుదులను ప్రకటించింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన బోలుమల్ల రాజమౌళి తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాట, కోలాటంతో, వీధి నాటకాలు, గొల్ల సుద్దులు చిత్రలేఖనములో ప్రతిభ కనబరిచినందుకు, అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరిచినందుకుగాను దళిత రత్న అవార్డును  ప్రకటించారు.

ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా బొలుమల్ల రాజమౌళి దళిత రత్న అవార్డు అందుకున్నారు. తన సేవలను గుర్తించి ప్రభుత్వం తనకు అవార్డు ప్రకటించినందుకు రాజమౌళి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.