రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కప్

రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కప్

జగిత్యాల  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కప్ క్రీడ పోటీలు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల అర్బన్, రూరల్ , మున్సిపల్ పరిది లో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడా పోటీలను జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ గ్రామ స్థాయిలో క్రీడల ప్రోత్సాహానికి క్రీడా ప్రాంగనాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం,ఉల్లాసం కలుగుతుందని,క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు చాలా మంది చేదువుల్లో సైతం రాణిస్తారన్నారు.

తల్లిదండ్రులు క్రీడలపట్ల పిల్లలను ప్రోత్సహించాలన్నారు.క్రీడా మైదానాలు అభివృద్ధి, వాకర్స్ కోసం,స్టేడియం లో  జిమ్ లు ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్ ,ఎంపీపీ లు ములాసపు లక్ష్మి,పాలేపు రాజేంద్ర ప్రసాద్,జెడ్పీటీసీ మహేష్, కౌన్సిలర్ చుక్క నవీన్,రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, పాక్స్  ఛైర్మెన్ సందీప్ రావు,జిల్లా కౌన్సిలర్ ఫోరం పంబాలా రామ్ కుమార్,సర్పంచుల ఫోరం చెరుకు జాన్,ఎంపీటీసీ ల ఫోరం మహేష్,ఎమ్మార్వోలు,ఎంపిడిఓ లు,ఎంపివో లు,అధికారులు,సర్పంచులు,ఎంపీటీసీ లు,కౌన్సిలర్ లు,తదితరులు పాల్గొన్నారు.